
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే సాగింది. అప్పటి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం (మే 21, 1991) శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అభ్యర్థి కణితి విశ్వనాథంకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్కి వెల్లారు. అక్కడ జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.